Previous Lesson -- Next Lesson
1. ఈ మధ్యవర్త ప్రార్థన పరిచయము
యేసు మనుషులను తన సువార్త కార్యముల ద్వారా పరిచర్యచేసాడు; కుంటి వాడిని బాగుచేయడము , ఆకలిగొనిన వారికి ఆహారము పెట్టడము, గ్రుడ్డివారికి చూపు ఇవ్వడము, మరియు మరణమును తిరిగి లేపుట. అతని ప్రేమ దేవుని మహిమను ప్రచురించడము మరియు ద్వేషము మరణమును జయించడము.
అతని ప్రారంభపు పరిచర్యలో, గుంపులు గుంపులు అతడిని వెంబడించాయి. ఎప్పుడైతే యూదుల మతము మరియు వారి పెద్దల పునాదులు యేసు పరిచర్యలో కదిలించబడ్డాయి, వారు యేసు మరణమును మరియు ఖండించి యేసును మరియు అతని శిష్యులును కూడా ఖండించింది. అయితే ఈ కార్యముల ద్వారా అతడిని వెంబడించిన వారిని అక్కడున్న వారు ఇబ్బందులు పెట్టినను క్రీస్తు వారిని ప్రేమించడము మరచిపోలేదు.
చివరలో పన్నెండుమందిలో ఉన్న ఒకరికి దురుద్దేశము పుట్టెను; అతను తన గురువును పట్టించుటకు సిద్దపడెను, అయితే క్రీస్తు తన నిబంధనను అనగా ఈ లోకమును విడిచి వేళ్ళు నిబంధనను నెరవేర్చుటలో అపొస్తలులకు వివరించెను. అతని చివరి ఘడియలలో తన తండ్రి తో తనకు ఉన్న ఐక్యతను మరియు తన ఆత్మతో ఉన్న సంరక్షణను వారి సహవాసములలో దానిని స్థిరపరచెను, ప్రేమను మరియు వచ్చు ఇబ్బందులను కూడా వారికి తెలియపరచెను.
అయితే శిష్యులు తమ ప్రభువు మాటలను స్వీకరించలేదు, ఎందుకంటె అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు వారి మీదకు పంపబడలేదు. కనుక క్రీస్తు తన తండ్రి దగ్గరకు నేరుగా వెళ్లి, తనకు తాను సమర్పించుకొని పెద్ద యాజకుడైన తండ్రిని వెంబడించెను. మరియు ఎవరైతే విశ్వసిస్తారో వారిని కూడా అపొస్తలులుగా సాక్ష్యము ఇచ్చెను.
క్రీస్తు మధ్యవర్త ప్రార్థన 17 వ అధ్యాయములో వ్రాయబడినది, దీని ద్వారా దేవుని కుమారుడు మనలను తన తండ్రితో సహవాసము కలిగించును, మరియు పరిశుద్దాత్మ త్రిత్వమునకు కూడా మధ్యవర్త్త్వము చేసినది. ఇక్క ఆత్మీయ ప్రార్థన చేయబడినది. ఎవరైతే ఈ అధ్యాయమును చదువుతారా వారు దేవుని దేవాలయములోనికి ప్రవేశించి అతనిని ఆరాధించెదరు.
2. తండ్రిని మహిమపరచు ప్రార్థన (యోహాను 17:1-5)
యోహాను 17:1
1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెనుతండ్రీ, నా గడియ వచ్చియున్నది.
యేసు తన తండ్రితో ఒక్కడు అని శిష్యులతో చెప్పెను అతను తండ్రితో ఉన్నాడు మరియు తండ్రి అతనితో ఉన్నాడు. ఎవరైతే అతడిని చూస్తారో వారు తండ్రిని చూశినట్టు. అయితే ఈ ప్రవచనమును శిష్యులు పట్టుకోలేదు. సైవత్వము కలిగిన శరీరము కలిగిన యేసును వారు ఈ విధముగా పట్టుకొనలేకపోయిరి. క్రీస్తు తన బలహీనతను తండ్రి సంరక్షణలోనికి శిష్యులను నడిపించెను. వారిని పరిశుద్ధ ప్రేమ కలిగిన దైవత్వము లోనికి నడిపించెను.
అతని కన్నులు పరలోకము వైపు పెట్టి. తన శిష్యులను ఆశ్చర్యము చేసెను. ఎందుకంటె తండ్రికి ప్రార్థన చేసి అదేసమయములో తండ్రితో ఉన్నది చెప్పి అతను తడిలో ఉన్నానని చెప్పెను ? అని ఆచార్య పడిరి. కనుక వారు అజ్ఞాన మనసు అర్థము చేసుకోలేకపోయెను. రెండు ఆలోచనలు నిజమే అని మనకు తెలుసును: ఎలా అనగా నిజమైన తండ్రి కుమారా ఐక్యత మరియు వారి సహవాసము ఒక్కటే. దేవుని గొప్పతనము మన మనసులకంటే మరియు పరిశుద్ధాత్ముడు వారిద్దరూ ఒక్కటే అను చెప్పుట సత్యము. ఒకవేళ ఇది నీవు నమ్ముట కష్టమైతే దేవుడిని అడుగు. ఎందుకంటె ఎవ్వరు కూడా సంపూర్ణముగా తండ్రిని మరియు కుమారుడిని పట్టుకొనలేదు, కేవలము పరిశుద్ధాత్మచేత తప్ప.
ఈ ప్రార్థనలో క్రీస్తు దేవుడిని తండ్రి అని పిలిచాడు. ఎందుకంటె దేవుడు కేవలము పరిశుద్ధత కలిగిన వాడు మాత్రమే కాదు అయితే న్యాయము చేయువాడు, మరియు దాయకలిగిన ప్రేమ కలవాడు. దేవుడు తనకు తాను పరిశుద్ధుడు మరియు నిజమైన దయకలిగిన వాడు. ఈ విధమైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కలిగెను. అతను దేవునితో నిత్యమూ జీవించెను అయితే మనుషులను రక్షించుటకు మనిషి శరీరము ధరించెను. యేసు ద్వారా ఈ మాట ఒక తండ్రి అయినా దేవుడు క్రీస్తులో తన సన్నిధిని ఉంచాడని చెప్పెను. దీని ద్వారా క్రీస్తు మన భయమును తీసివేసి సత్యమును ఇచ్చి మనలను అందులోనికి నడిపించెను. కనుక నీవు ఒకవేళ క్రీస్తు నామమును అన్ని సందర్భాలలో జ్ఞానము కలిగి వాడినట్లైతే అప్పుడు నీవు అతని సువార్తను పట్టుకొనినట్లు.
ఈ లోక ఘడియ నిలిచింది అని క్రీస్తు తన తండ్రితో చెప్పెను. అదే మనిషికి మరియు దేవునికి సమాధానము కలిగినది అని.మనుషులు, దూతలు, మతస్తులు మరియు జ్ఞానులు ఈ ఘడియకొరకు ఎదురుచూసిరి. ఇది వచ్చెను. అప్పుడు క్రీస్తు ఈ లోక పాపమును దేవుని గొర్రెపిల్ల ద్వారా చూపెను. అతను ఒంటరిగా దేవుని ఉగ్రతనునుండి మనుషులను కాపాడుటకు చనిపోవుటకు సిద్దపడెను. ఆ సమయములో క్రీస్తును పట్టించుటకు తన సైన్యముతో దేవుని కుమారుని దగ్గరకు యూదా ఇస్కరియోతు వచ్చెను, అయితే సత్వేఏకము కలిగి శక్తి కలిగిన వాడు అందరి పాపములకొరకు చనిపోవుటకు సిద్దపడెను.
యోహాను 17:2
2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.
చాల మంది "మహిమ" ను ఒక కాంతి మరియు వెలుగు అని అనుకుంటారు. యేసు చెప్పినట్టు అతని త్యాగము ప్రేమ చేత చేయబడి అది మహిమ కొరకు చేయబడినది. అతను తన తండ్రిని సిలువ శ్రమలలో మరియు ఆ గాయములు నొప్పితో ఆ ప్రేమలోనే ఉంచుమని అడిగెను, యెదనుకంటె ప్రేమతో మానవులపాపముల కొరకు సిలువ మరణము పొందుటకు ఇష్టపడెను కనుక. దోషులకొరకు మరియు వ్యతిరేకులకొరకు kumaarudu సిలువ మరణమును పొందుటకు ఇష్టపడి ఉన్నాడు, అప్పుడు వారు అతని మరణముచేత విముక్తి కలిగిన వారుగా ఉంటారని. ఇదే కుమారునికి మహిమ.
అయితే క్రీస్తు తనకొరకు మరణించలేదు కానీ తన తండ్రిని మహిమపరచి మరియు ఈ విధమైన త్యాగము ఎవ్వరు కూడా చేయలేరు కనుక సిలువ మరణమును సంతోషముగా స్వీకరించెను. సిలువమీద తన తండ్రిని మహిమపరచి ఈ లోక నివాసులకు దేవునితో సమాధానపరచెను. ఎప్పుడైతే పాపము క్షమించబడినదో అప్పుడు దేవుని ప్రేమ కనపరచబడినది, మరియు అందరు దత్తతకు ఆహ్వానించబడినారు. విశ్వాసులమీద క్రీస్తు ద్వారా పరిశుద్దాత్మ నింపబడినప్పుడు, వారు తండ్రిని మహిమపరచి పరిశుద్ధమైన మార్గములో నడిచారు. తండ్రి తన పిల్లలద్వారా మహిమపరచబడిన దానికంటే గొప్పది ఏది కూడా తండ్రి పిల్లలగుటకు మార్గము లేదు. కనుక ఆ తండ్రిని మహిమపరచుటకు క్రీస్తు తన ఆత్మ ద్వారా అనేకమందిని నూతన జన్మము ద్వారా తండ్రి నామమును మహిమపరచుటకు కార్యము సంపూర్ణముగా చేసెను.
స్త్రీద్వారా జన్మించిన వానికి సమస్త అధికారము ఇవ్వబడినది. క్రీస్తు నిజమైన దేవుడు, సృష్టికర్త మరియు విమోచకుడు. అతను మన ప్రభువు, రాజు మరియు న్యాయాధిపతి. మనము అతనికి చెందినవారము, అతను మన నిజమైన నిరీక్షణ. అతనికి వచ్చిన అధికారము నాశనము చేయుటకు , తీర్పుతీర్చుటకు కాదు అయితే రక్షించి నడిపించుటకు. క్రీస్తు ముఖ్య గురి ఏమిటంటే, విశ్వాసులు నిత్యా జీవమును కలిగి ఉండుట. కనుక మరణమునకు వారి మీద ఎటువంటి అధికారము లేదు. సిలువ మీద క్రీస్తు మనుషులందరి పాపమును క్షమించినాడు;దీనికి కొంతమంది మాత్రమే ఈ రక్షణకు స్పందించారు. తండ్రిని, కుమారుడిని మరియు పరిశుద్ధాత్మను విశ్వసించుటకు విశ్వాసులను క్రీస్తు ఎన్నుకొన్నారు, మరియు క్రీస్తు రక్షణ కలిగిన మహిమతో ఉండుటకు కూడా ఎన్నుకొని ఉన్నాడు. వారిలో ఈ ఆత్మ నిలిచి ఉందును. వారు నూతనముగా ఉండుట అంటే తండ్రి మహిమతో అతని అద్బుతములను తండ్రి నామములో విశ్వసించుట.
యోహాను 17:3
3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
యేసు దేవుని గురించి చెప్పినది పరిశుద్ధాత్ముడు కూడా బదులుగా చెప్పెను. అతను క్రీస్తు తండ్రిగా ఉంది మనకు కూడా తండ్రిగా ఉన్నాడు. ఎవరైతే ఈ దైవత్వము యొక్క రహస్యమును తెలుసుకొంటారో వారు నిత్యజీవము పొందుకుంటారు. కనుక క్రీస్తు ద్వారా తప్ప మనకు దేవునిని తెలుసుకోవటానికి వేరే మార్గము లేదు. ఎవరైతే కుమారుడిని చూసి, అతని తండ్రిత్వమును విశ్వసిస్తారో వారు అతని కుమారులలో ఒకరు గా ఉంటారు. అయితే క్రీస్తును విశ్వసించినట్లైతే కేవలము జ్ఞానము మాత్రమే కాదు గానీ ఆత్మీయ జీవితములో ఎదుగుదల కలిగి ఉంటారు. దేవుడు తన రూపమును ప్రతి విశ్వాసిలో ఉంచును. ఈ రూపమునకు గల సూచన ఏమిటి ? అది ప్రేమ, సత్యము మరియు దేవుని పిల్లలగుటకు కావలసిన నిష్కపటము. ఇది దేవుడిని కూడా మహిమపరచుట .
దేవుడే క్రీస్తును ఈ లోకమునకు పంపి ఉన్నాడు, ఎందుకంటె ఆత్మ ద్వారా జన్మించినవాడు , సిలువమరణము పొంది పునరుత్థానుడై లేచిన వాని ద్వారా తప్ప మరియు ఎవరును దేవుడిని తెలుసుకొనలేరు కనుక. కుమారుడు మాత్రమే పరిశుద్దముకలిగి అపొస్తలులందరిని కలిపి వారి యెడల ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి ఉండెను. ఒకవేళ నీవు నిజమైన దేవుడిని తెలుసుకోవాలనుకుంటే , క్రీస్తు జీవితమును చదివినట్లయితే దేవుని వ్యక్తిత్వమును గూర్చి తెలుసుకుంటావు. అతను మెస్సయ్య మాత్రమే కాదు , అయితే రాజులకు రాజు, మరియు యాజకుడు, మరియు నిజమైన ప్రవక్త దేవుని స్వరూపము.
యోహాను 17:4-5
4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. 5 తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.
యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు, తన తండ్రిని నిత్యమూ ధ్యానించి, అతని కార్యములను చేయుచు అతనికి సాక్షిగా ఉండెను. తన తండ్రిని మహిమపరచుటకు తనను తాను తిరస్కరించెను. ఏదైతే తన తండ్రి ద్వారా విన్నాడో అదే అందరిని తెలియపరచెను. తన ప్రార్థనలన్ని ఆలకించబడుతాయని తన జీవితమంతా తన తండ్రిని మహిమపరచెను. సిలువ మీద తన తండ్రి ఇచ్చిన విమోచన పనిని సంపూర్ణముగా చేసెను. తన తండ్రి కార్యములన్ని చేసి ఉన్నాడని చెప్పెను. మనందరినీ నిత్యములోనికి నడిపించుటకు తనను తాను ఖాళీ చేసుకొని మనకు ఈ మిహమా కరమైన నిత్యజీవమును యిచ్చియున్నాడు. అందుకే అతను తనను తాను నిత్యా మహిమ కలవాడిని, దేవుని వెంబడి దేవుడను, వెలుగు వెంబడి వెలుగు ఏకైక కుమారుడిని అయితే సృష్టించబడని వాడను అని చెప్పెను. ఎప్పుడైతే అతను పరలోకమునకు చేరేనా, అప్పుడు దూతలు అతడిని ఈ విధముగా మహిమపరచిరి, " చంపబడ్డ గొర్రెపిల్ల మహిమపరచబడుటకు యోగ్యుడు, ఘనత జ్ఞానము, శక్తి గౌరవము, మహిమ మరియు ఆశీర్వాదము". పొందుకొనుటకు యోగ్యుడు.
ప్రార్థన: పరలోకమందున్న మాతండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ కుమారుడు నిన్ను తన నడవడికతో, ప్రార్థనతో మరియు త్యాగముతో మహిమపరచాడు. మేము నీ వైపు మా కన్నులను యీట్టుటకు యోగ్యులము కాము. క్రీస్తు మాకొరకు చనిపోయిన దానిని బట్టి మా పాపములను క్షమించినందుకు నీకు కృతజ్ఞతలు; మీరు మమ్ములను మీ పిల్లలుగా చేసినారు. నా హృదయములోనికి నీ పరిశుద్ధాత్మను పంపి నాకు నిత్యజీవమును దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు. నిన్ను మేము నిత్యమూ మహిమపరచునట్లు మాకు సహాయము చేయుము, అప్పుడు మేము నీ కుమారుని ప్రతి ఆజ్ఞను గైకొందుము. అప్పుడు ఇతరులు నీ మంచి కార్యములు చూసి నిన్ను మహిమపరచుదురు.
ప్రశ్న:
- యేసు మొదటి ప్రార్థనలో ప్రాముఖ్యమైన ఆలోచన ఏమిటి ?