Previous Lesson -- Next Lesson
a) యొర్దానును యేసు దాటుట ( యోహాను 10:40 - 11:16)
యోహాను 10:40-42
40 యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను. 41 అనేకులు ఆయనయొద్దకు వచ్చియోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి. 42 అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
యేసుకు మరియు పరిసయ్యులు మధ్యన ఉన్న యుద్ధము తెగిపోయెను; వారి నాయకులు యేసు బేతెస్ద అను కోరేరు దగ్గర ఆ కుంటివానిని స్వస్థ పరచినప్పుడే జరిగెను (5 అధ్యయము ) . యేసు మూడవ సారి యేసు యెరూషలేమునకు వచ్చినప్పుడు వారికున్న ఆ భావన పూర్తిగా తొలగిపోయెను. వెలుగు చీకటిలో ప్రకాహించెను అయితే చీకటి వెలుగును కనుగొనలేకపోయెను. అన్ని సమయాలలో క్రీస్తు మరణమును తెలియపరచెను. క్రీస్తు దేవాలయములోనికి ఎన్నో సార్లు వెళ్లి అతని శిష్యులకు జ్ఞానమును గూర్చి మరియు విశ్వాసమును గూర్చి ఎన్నోసార్లు వివరించెను.
సమర్పణ పండుగ అయిపోయినప్పుడు , యేసు యెరూషలేమును వదిలి యొర్దానులో ఉన్న పెద్ద సంఘమునకు వేల్లెను. ఇక్కడ బాప్తీస్మమిచ్చు యోహాను క్రీస్తు కంటే ముందుగానే ప్రకటించియున్నాడు, అయితే ఇది యూదుల అధికారంలో మరియు హేరోదు రాజు హయాములో ప్రకటించియున్నాడు. అందుకే యోహాను అక్కడ అందరికి చాల తెలిసినవాడు, మరియు క్రీస్తుకు ఇతను ఒక సాక్షిగా ఉన్నాడు.
ఎవరైతే యోహాను ప్రకటించినప్పుడు విశ్వాసములోనికి వచ్చారో వారు వారి విశ్వాసముతో స్థిరముగా ఉన్నారు. అయితే వారి గురువు తల నరికిన యున్నారు. ఎప్పుడైతే క్రీస్తు అక్కడికి వచ్చాడో అప్పుడు ప్రజలందరూ కూడా అతని దగ్గరకు పరిగెత్తి పోయారు, ఎందుకంటె అతని శక్తిని మరియు మహిమను తెలుసుకొన్నారు కాబట్టి. నమ్మకముగా దేవుని వాక్యమును మరియు అతని మాదిరికరమైన సూచనలను వారికి తెలియపరచెను. కనుక చాలామంది సువార్తకు వారి హృదయములను తెరచి, వారి విససములను కాపాడుకొనియున్నారు. అయితే ఎప్పుడైతే యేసు వారి దగ్గరకు వచ్చాడో అప్పుడు వారు యేసును రక్షకునిగా మరియు ప్రభువుగా విశ్వసించిరి.
యోహాను 11:1-3
1 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడురోగియాయెను. 2 ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకుసహోదరుడు. 3 అతని అక్క చెల్లెండ్రుప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
యొర్దానులో యేసు ప్రకటిస్తున్నప్పుడు లాజరు అను మనుష్యుడు అనారోగ్యము కలిగి ఉన్నాడని యేసుకు చెప్పిరి. అతను ఓలీవు అను పర్వతమునకు చెందినవాడు, యేసు ఆ ఇంటికి అప్పుడప్పుడు ఒక అతిధిగా వెళ్లెను. అప్పుడు క్రీస్తు లాజరు సహోదరి అయినా మర్ధతో మాట్లాడి ఉండెను. యోహాను ఈ సంఘటనలను తన సువార్తలో వ్రాయలేదు ఎందుకంటే ఇవి వేరే సువార్తలలో వ్రాయబడెను కనుక. అయితే తన బుద్ధిలోనుంచి అత్తరును యేసు పాదములకు పూసిన మరియా గురించి వ్రాసెను. అయితే సువార్తికుడు ఈ స్త్రీ క్రీస్తు వాక్యము కొరకు ఆకలిగొని ఉన్నాడని వ్రాసియున్నాడు. ఆ నూనెను క్రీస్తు పాదములకు వ్రాసినతరువాత తన వెండ్రుకలతో అతని పాదములను తుడిచెను. (యోహాను 12:1-8). ఆ విధముగా ఆ స్త్రీ తన మానవత్వముని మరియు దేవుని కుమారుని మీద తనకున్న విశ్వాసమును తెలియపరచెను.
లాజరు అనారోగ్యమును బత్తిన వార్త యేసుకు బాధ కలిగించెను. అయితే అతని సహోదరి విశ్వాసము క్రీస్తు దగ్గరకు వచ్చుటకు సహకరించెను. వారు యేసును తన సహోదరుడిని స్వస్థపరచుమని బ్రతిమాలుకొనలేదు అయితే అతని పరిస్థితిని మాత్రమే వివరించిరి, ఎందుకంటె అతనిని క్రీస్తు స్వస్థ పరచగలదని వారికి నమ్మకము కలిగెను కనుక . " లాజరు " అనగా " దేవుడు సహాయము చేసాడు " అని అర్థము. కనుక ఈ అద్భుతము యోహానుకు తన గ్రంథ సారాంశమాయెను.
యోహాను 11:4-10
4 యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. 5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. 6 అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను. 7 అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా 8 ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి. 9 అందుకు యేసుపగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు. 10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.
ఎప్పుడైతే క్రీస్తుకు సమాచారం వచ్చినదో అప్పుడు తన మరణమును గూర్చిన శ్రమను బట్టి జాగ్రత్త కలిగి ఉన్నాడు.అప్పుడు క్రీస్తు ఆహారము కొరకు మరణము వస్తున్నదని పుండుగానీ ప్రవచించెను. అయితే దేవుని మహిమతో అతను ప్రకాశించును. యేసుకు పరిశుద్దాత్ముని ద్వారా తన స్నేహితులకు ఏమి చేయాలో ముందుగానే తెలుసుకొన్నాడు, అతని అధికారమును మృతి పొందిన వాడిని లేపి యెరూషలేము గుమ్మములో ఈ కార్యమును చేసెను. కనుక ఆ యెరూషలేములో ఉన్నవారికి ఏవిధమైన అనుమానము లేకుండెను.
దేవుని మహిమ మరియు క్రీస్తు మహిమ కూడా ఒకటిగానే ఉన్నది. మహిమ అనునది మరణమును మరియు మృతిని తెలియపరచునది. యేసుకు తన తండ్రి చిత్తము తెలిసి కాబట్టి మరణమును బత్తిన విషయమును గమనించెను. రోగముకలిగిన దేశములో అతను జీవమును ఇచ్చును.
యేసు నేరుగా బెథానీ కు వెళ్ళలేదు; అయితే వెళ్ళుటకు రెండు దినములు ఆలస్యము చేసెను. కనుక మరణము అతని స్నేహితుడిని మ్రింగుటకు అవకాశమిచ్చెను. యేసు తిరిగి యూదాకు వెళ్ళుట శిష్యులకు ఇష్టములేకపోయెను ఎందుకంటె ఇంతకూ ముందే అక్కడ క్రీస్తును రాళ్లతో కొట్టాలని చూసిరి కాబట్టి. శిష్యులు లాజరు గురించి మరియు దేవుని సాక్ష్యమును గురించి ఇష్టపడలేదు అయితే వారి జీవితములు గురించి భయపడిరి.
ఆ సమయములో, ఒకడు పగటి పూత జాగ్రత్తగా ప్రయాణము చేయునను ఉపమానమును చెప్పెను, అయితే రాత్రిపూట అతను కష్టాలలోనికి వెళ్లవచ్చును. సిలువ మరణము సమీపించగా పగటి వెలుగు కరువాయెను. ఎందుకంటె వారు జాగ్రత్తగా యెరూషలేమునకు దేవుని చేతులలోకి వెళ్ళాలి కాబట్టి.
ఎవరైతే క్రీస్తు పోషణను నమ్మకపోతే వారు కటిక చీకటిలో ఉండు వారు. ఎందుకంటె వారి పైన వెలుగు కరమైన విశ్వాసము ప్రకాశించలేదు కాబట్టి. అయినప్పటికీ యేసు తన శిష్యులను తన మీద సంపూర్ణ నమ్మకము కలిగి ఉండుమని ఆజ్ఞాపించెను. లేనియెడల అవిశ్వాసము వారిని చీకటిలోకి నడిపించును. కనుక దేవుని చిత్తము లేనిదే ఏది కూడా జరగదు మరియు అతనితోనే మనకు సంపూర్ణ నమ్మకము ఉన్నది.
ప్రార్థన: ప్రభువైన యేసు మా జీవితములకు నీవు గురువుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ వెలుగులోనే మేము మార్గమును చూస్తున్నాము. నీవు మమ్ములను నిజమైన మార్గములోనికి నడిపించు. ఎందుకంటె మా శత్రువులు మమ్ములను పట్టుకొనుటకు సిద్ధముగా ఉన్నారు. నీ గురించి మేము మరణించుటకు మరియు జీవించుటకు గల సహాయమును దయచేయుము. అప్పుడు మీ సంరక్షణ మా యెడల మహిమపరచబడుతుంది.
ప్రశ్న:
- లాజరు చేనిపయినా కూడా దేవుని మహిమ గురించి యేసు ఎందుకు మాట్లాడినాడు ?