Previous Lesson -- Next Lesson
1. బేతెస్థలో పశ్చావాతము గలవాడిని స్వస్థపరచుట (యోహాను 5:1-16)
యోహాను 5:10-13
10 ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులుఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. 11 అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడునీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. 12 వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. 13 ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
అక్కడున్న అనేకులు బేతెస్థ కోనేటి గుమ్మము దగ్గర ఉల్లాసముగా ఉండి. వీరు సబ్బాతు దినమందు చేసిన అద్బుతమును బట్టి చాల ఆనందించుచుండిరి. అక్కడ యేసు ఆ మనిషిని కేవలము స్వస్థపరచడమే కాక తన పరుపు ఎత్తుకొని పట్టణములోనికి వెళ్లుమని ఆజ్ఞాపించెను.ఇది వారికి మరియు సబ్బాతు దినమునకు వ్యతిరేకమని యెంచిరి. ఎందుకంటె ఆ దినము ఒక విశ్రాంతి దినముకాబట్టి. ఎందుకంటె ధర్మశాస్త్రమునకు వ్యతిరేకం ఏడిచేయబడినను మరణముతో సమానము (సంఖ్యా 15:32-36). యూదులు మెస్సయ్య ఇంకను రాలేదని అనుకొనిరి ఎందుకంటె సబ్బాతు దినమును అక్కడున్న ప్రతి ఒక్కరు పాటించినప్పుడు మాత్రమే మెస్సయ్య వస్తాడని వారి భావము.
అక్కడ ఉన్న యూదులు స్వస్థత పడిన వ్యక్తిని రాళ్లతో కొట్టలేదు అయితే దానికంటే ముందుగానే వారికి ఈ విషయము గూర్చిన సమాచారం ఇవ్వబడినది. అయితే స్వస్థతకలిగిన వ్యక్తి యేసు చెప్పినట్టు తన పరుపును ఎత్తుకొని పోవడము అనగా ఆయన చెప్పినట్టు చేసినప్పుడే ఆయనకు సంపూర్ణమైన స్వస్థతకలుగును అని అనుకొనెను.
అక్కడ స్వస్థతకలిగిన వ్యక్తికీ న్యాయసమ్మతి చేయబడినది, మరియు యేసు ఆయన పట్ల చూపిన తన ప్రేమను ఎవరు కూడా వ్యతిరేకించలేదు. అయితే స్వస్థత చేసిన యేసును వారు శత్రుత్వం భావముతో వ్యతిరేకించిరి, ఎందుకంటె సబ్బాతు దినమున యేసు ఈ కార్యము చేయుట వారికి ఇష్టములేకపోయెను. కనుక యేసు వారి దృష్టిలో ఒక దోషము చేసినవాడుగా ఉన్నాడు.
స్వస్థత కలిగిన వానికి స్వస్థత చేసినవన్నీ గురించి తెలియదు, ఎందుకంటె యేసు ఒక పరదేశి అయి ఉన్నడ్డు కనుక. బేతెస్థ స్థలమునకు రావడము యేసుకు అది మొదటి సారి. స్వస్థపరచిన తరువాత ఆటను అదృశ్యమయినాడు. యేసుకు తనపైన తనకు ఈ కార్యములను చేయుటకు తగిన విశ్వాసము కోరుకోలేదు అయితే అతను ప్రేమించుచున్నవారికి ఈ విశ్వాసము ఉండాలని కోరుకున్నాడు.
యోహాను 5:14-16
14 అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి;మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా 15 వాడు వెళ్లి,తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. 16 ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.
యేసు స్వస్థత పొందిన మనిషి దేవుని ఆలయములో దేవుడిని ఆరాధించుట చూచెను. ఎప్పుడైతే యేసును అతను చూశాడో భయము కలిగి ఆనందముకలిగి యేసు వైపు చూసేను. యేసు ఆయనకు ఏమి చెప్పాడో మనకు తెలుసు.
నీవు స్వస్థతపొందినావు. గత 38 సంవత్సరములనుండి నీ రోగములో ఉండి బాధపడుచుంటివి, అయితే నీకున్న ఆషానుబట్టి నీకు స్వస్థతకలిగినది, ఇది ఒక దైవత్వము ద్వారా కలిగిన కార్యము కానీ ఏ మినిషి చేయలేని క్రియ. దేవుని అవతారమే నీ హృదయ చూపును తెరచుయున్నది.
నీకు నీ పాపములు తెలుసు. దేవుడు లేని జీవితము నీకు అపాయకారము. నా స్వస్థత ద్వారా నీ ప్రతి దోషము కడగబడినది. స్వస్థత అనునది అంతరంగమందు కలిగినది,కనుక యేసు లోబడి ఇక పాపము చేయకు అన్నాడు. క్షమించుట అనేది తిరిగి అదే పాపము నుండి విముక్తి పొందుట. ఎవరైతే క్రీస్తు శక్తిని మరియు అయన వాక్యమును ఒప్పుకొంటారో వారు తన శక్తిని పొంది దేవుని సహాయముతో చెడును విసర్జిస్తారు. క్రీస్తు మననుంచి అసాధ్యమైనదానిని అడగలేదు అయితే ప్రతి విధమైన సమస్యను ఎదుర్కొనుటకు తన శక్తిగల పరిశుద్ధాత్మను మనకు దయచేసియున్నాడు. పరిశుద్దాత్మ శక్తి మనలను చెడును విసర్జించుటకు సహాయపడుతుంది.
కొన్నిసార్లు మన రోగములు దేవుని నుంచి మనలను దూరము చేస్తాయి. అదేవిధముగా కొన్నిసార్లు ధనము మరియు విలాసము దేవుని నుంచి మనలను దూరంచేస్తుంది. అప్పుడు మనిషి సాతానుకు దాసుడై నిత్యా జీవమునకు దూరముగా ఉండును. నీవు పాపమునకు దాసుడుగా ఉండకుము అయితే వాటినుంచి నీకు స్వాతంత్రము కలుగునట్లు క్రీస్తును అడుగుము. పాపమునకు మరియు క్రీస్తుకు మధ్య తేడాను పెంచుకో. నీ పాపములను మానుకో. నీ రక్షకుని నిన్ను రక్షించుమని వాగ్దానము చేయమని అడుగు.
ఏమి అద్భుతము! క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన మనిషి యూదులదగ్గరకు పరుగున వెళ్లి, నజరేయుడు తనను స్వస్థపరచి సబ్బాతునుంచి తనను విమోచించెను అని చెప్పాడు.
యాజకులు యేసు చేసిన స్వస్థతను బట్టి ద్వేషిచువారిగా ఉండి యేసు దేవాలయమును శుబ్రము చేయుట పరిస్సయ్యాలకు కూడా వ్యతిరేకమాయెను. క్రీస్తు వారు ధర్మశత్ర సంబంధమైన నీటిని తీసివేసి, దేవుని దయ మరియు ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ లేకుండా పరిశుద్ధత రాదు. కనుక దేవుడు మనలో దయను కోరుకుంటున్నాడు. కృతజ్ఞతకలిగిన దేవుడు మనలను స్వత్నత్రులనుగా చేసి తన ప్రేమతో మనలను ప్రేమించెను.
ప్రశ్న:
- యూదులు క్రీస్తును ఎందుకు శ్రమపెట్టియున్నారు ?