Previous Lesson -- Next Lesson
a) వ్యభిచారులు యేసు పచ్చాత్తాపములోనికి నడిపించుట (యోహాను 4:1-26)
యోహాను 4:16-24
16 యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. 17 ఆ స్త్రీనాకు పెనిమిటి లేడనగా,యేసు ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; 18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. 19 అప్పుడా స్త్రీ అయ్యా,నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను 21 అమ్మా,ఒక కాలము వచ్చుచున్నది,ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; 22 మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు,మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము;రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. 23 అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరు చ 24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
క్రీస్తు దాహము అనే ఆ స్త్రీ జీవ జలము కొరకు నిద్రలేచినపుడు, ఆటను ఆమె ఇష్టమును జరిగించినాడు. ఆమె ఆ బహుమానమును పొందుటకు క్రీస్తు సహాయపరచినాడు. ఆటను ఆమెను, "నీవు ఒక వ్యభిచారివి" అని చెప్పలేదు. అయితే నీ పెనిమిటిని పిలువుమని చెప్పినాడు. ఇది ఆమె హృదయములో నాటుకొని పోయినది. అందరి స్త్రీలవలె తాను కూడా తన భర్త యొక్క మంచిని కోరుకున్నది. అయితే ఆమె యేసుదగ్గరకు వచ్చుటకు సిగ్గుపడి నేను ఒంటరి అనే భావన కలిగి ఉన్నది. అందుకే ఆమె "నాకు పెనిమిటి లేదు" అని చెప్పినది.
క్రీస్తు తన సత్యమును క్లుప్తముగా తెలియపరచియున్నాడు, ఎందుకంటె ఎవరికి ఆ రహస్యాలు తెలియవు కనుక. ఎందుకంటె ఆమెకు తెలుసు ఆమె ఒంటరిని మరియు ఆమెకు ప్రేమ కరువైనదని మరియు తన పాపము ఒకరినుంచి వేరొకరికి ప్రాప్తిస్తున్నదని.
ప్రతి వ్యభిచారి ప్రవర్తన ఈమె వలెనే అంటారా భావన కలిగి ఉంటుంది. ఇది జరిగిన తరువాత కూడా ఈమె తన పెనిమిటి పోషణ గురించిన ఆలోచన కలిగియున్నది. తిరిగి తనతో కలిసి ఉండాలని మరియు అర్థముచేసుకొని ఉండాలని.
అప్పుడు ఆమె క్రీస్తు గురించి ఆయన ఒక సామాన్య మైన మనిషి కాదని ఆయన ఒక ప్రవచన కలిగిన వాడని గ్రహించెను. మరియు దేవుడు మాత్రమే తణుకు సహాయము చేయును అని అనుకొనెను. అయితే అతనిని ఆమె ఎక్కడ కనుగొనును ?ఎలా ?ప్రార్థన ఆమెకు మార్గమాయెను. ఎంతో కాలమువరకు ఆమె ఏ విధమైన మాట ఆచారములు పాటించలేదు లేదా ఆ సహవాసమునకు హాజరుకాలేదు,అయినప్పటికీ దేవుని సమాధానమును మరియు విమోచనకొరకు ఎదురుచూచుచుండెను.
క్రీస్తు ఆమె దాహమును తీర్చినతరువాత, ఆమెకు ఆరాధన క్రమము అనగా ఒక వ్యవస్థాన్కు చేయూతకాదని అయితే ఒక మనిషి ఆ ఆరాధనను చేయాలనీ తెలియపరచెను. దేవుడు పరలోక తండ్రి అని. మరియు ఆమెకు తన కుమారుని ద్వారా రక్షణను ఇచ్చేనని. "తండ్రి" అని పదమును మూడు సార్లు వాడుకున్నాడు. అయితే ఇది దేవుని యందు కలిగినది కాదు కానీ క్రీస్తు మీద ఉన్న విశ్వాసమే.
ఈ లోకములో దేవుడు అని పిలువబడుచున్న ప్రతి ఒక్కరికి ఈ "తండ్రి" అని పదము రాదు. ఎందుకంటె సమారాయులు ఎన్నో విధమైన దేవుళ్ళకు పూజలు చేసేవారు. అయితే దేవుడు ఎవరనేది యూదులకు తెలుసు, చరిత్రలో ఎవరికొరకు ఎదురుచూస్తున్నారో అని, మరియు ఎవరి కొరకు వాగ్దానము చేయబడినట్లుగా దావీదు వంశములో రక్షకుడు జన్మిస్తాడు అని.
బైబిల్ యొక్క ఉద్దేశము లోకమంతా బైబిల్ మతము ఉండాలని. అందుకే అప్పటినుండి దేవుని ఆరాధన ప్రతి దేవాలయములో జరుగుతున్నది. విశ్వాసులు దేవుని ఆలయమై క్రీస్తు ఆత్మ వారి హృదయములో నివాసముచేయబడి; వారి జీవితమంతా దేవుని ఘనపరచునట్లు దేవునికి ఆరాధన చేసారు. దేవుని ప్రేమలోకి ప్రవేశించుటకు క్రీస్తు విమోచన వారికి ఒక సమయము గా ఉండెను. వారి జీవితము ఒక శక్తిచేత, సత్యముచేత మరియు ఒక శుద్దమైనదిగా ఉండెను. వారి పరలోక తండ్రి వారిని మార్చుయున్నాడు. వారి హృదయము ఆరాధనచేత సంపూర్ణముగా నిండినది. " మా పరలోకమందున్న తండ్రి" అని దేవుడు తన పిల్లలు పిలుచుట ఆయనకు ఇష్టమైనది.
దేవుడు ఒక విగ్రహముగా లేక ఆత్మ స్వరూపి యై ఉన్నాడు. మన ప్రతి బలహీనత మరియు మన సామర్థ్యమును తెలుసు ఆయనకు తెలుసు. ఆయన తన కుమారుని ద్వారా మనదగ్గరకు వచ్చి మన ప్రతి పాపమును కడిగి మనకొరకు త్యాగముచేసిన వాడాయెను. దేవునికి చాలామంది పిల్లలు ఉండాలని కోరుకొనియున్నాడు. కేవలము అతని పిల్లలు మాత్రమే నిజమైన ఆరాధనను ఆయనకు చెల్లించెదరు. మనము ఆయనను ప్రేమించుటకు మనము రాండ్రికి ప్రార్థన చేసి తన ఆత్మచేత నింపబడునట్లు తన కృపను మనము పొందుటకు ఆయనయందు బాధ్యత కలిగి ఉండవలెను.
ఎవరు కూడా యుక్తముగా ఆరాధించలేరు అందుకే యేసు తన బహుమానంగా ఆత్మను మనకు యిచ్చియున్నాడు. అతనిలో మనము ఆనందముకలిగినవారముగా మరియు ఆయనయందు ధైర్యము కలిగిన వారీగా ఉండుము. అప్పుడు మన తండ్రి అయినా దేవునిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించువారుగా ఉంటాము.
క్రీస్తు దేవాలయమును నిజమైన ఆరాధన చేయునట్లు పూర్తిగా కడిగిఉన్నాడు. తండ్రి ఆ సమయములో ఆమెకు కలిగిన పాపమును కడుగుటకు క్రీస్తు ద్వారా సహాయము చేసియున్నాడు. అందుకే తన పాపమును ఒప్పుకొనుటకు మరియు తన దాహమును తీర్చుటకు యేసు ఆమెకు కృపను దయచేసియున్నాడు.
ప్రార్థన: పరలోకమానుదున్న మా తండ్రి మిమ్ములను మా హృదయములోనుంచి గౌరవించుటకు మరియు మేము ఆశకలిగి మిమ్ములను కృతజ్ఞతా చెప్పుటకు సంతోషిస్తున్నాము, మా ఆరాధనను అంగీకరించి మేము నీ కుమారుడిని వెంబడించుటకు నిన్ను మహిమపరచుటకు మమ్ములను నడిపించు. మీ వాక్యమును ధ్యానించి వాటి ప్రకారము నడుచుటకు మా హృదయములను నీ ఆత్మతో నింపి మీ సువార్తను ఇతరులకు వివరించులాగున మమ్ములను నడిపించు.
ప్రశ్న:
- నిజమైన ఆరాధన చేయుటకు ఏమి అద్దము, దాని ద్వారా ఏమౌతుంది ?
యోహాను 4:25-26
25 ఆ స్త్రీ ఆయనతోక్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును;ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా 26 యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
ఆ స్త్రీ యేసు యొక్క శక్తిని మరియు సత్యమును తెలుసుకున్నది' మరియి ఆటను ఆమెకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరుట చూడాలని ఇష్టపడెను. మరియు క్రీస్తు రాకడను గురించిన ప్రవచనము కనబడుట జ్ఞాపకము చేసుకొనెను. ఆమీ నిరీక్షణ అతను నామమునే ఉన్నాడని మరియు అతను మాత్రమే నిజమైన ఆరాధనను నేర్పువాడని నమ్మినది .
యేసు ఈ స్త్రీ ఎదుట చేసిన కార్యము ముందే ఉహించలేదు, లేదా ఏ విధమైన కార్యములో చేయాలని తలంచలేదు. అయితే నేనే వాగ్దాన వాడని, దేవుని ద్వారా పంపబడియున్నాని, మరియు పరిశుదాత్మచేత నింపబడియున్నని. " నేను మనిషికి దేవుని బహుమానము; దేవుని వాక్యము మనుష్యులకు ఒక మనిషిగా వచ్చెను."
ఆ స్త్రీ మెస్సయ్య రాజులజు రాజాని మరియు ప్రవక్తలందరికంటే ఉన్నతుడని తెలుసుకొనుటలో ఓడిపోయినది. ఆమె తన రాకడ పునరుత్థానమునకు మరియు సమాధానమునకు సాదృశ్యముగా ఉండెను. అదేవిధముగా యూదుల రాజకీయ నాయకుల గురించి కూడా ఆమె విని ఉంటుంది. అయితే వీటన్నిటికంటే రక్షకుడు ఆమెను రక్షించి క్రీస్రు మాత్రమే తనను విడిపించగలదని విస్వసించెను.
అందుకే " నేనే మీ దగ్గర మాట్లాడుచున్నది" అని యేసు పలికెను. పరలోక ప్రణాలికను పరియు ప్రవక్తల వాగ్దానములు ఈ "నేను" అని మాటలో అర్థము ఉన్నది. ఎవ్వరు కూడా నేనే మిస్సయ్యాను అని చెప్పలేరు. అయితే అంత్యక్రీస్తు వచ్చి నేనే మెస్సయ్య అని చెప్పగలడు.అయితే క్రీస్తు తన ప్రేమ చేత ఆ స్త్రీని తన పాపములను క్షమించి ఆ సమరయ స్త్రీకి తన జాలిని దయచేసియున్నాడు.