Previous Lesson -- Next Lesson
2. క్రీస్తు కొరకు పాటు పడే సాక్ష్యాలు (యోహాను 1:29-34)
యోహాను 1:31-34
31 నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొబాప్తిస్మమిచ్చుచువచ్చితిననిచెప్పెను. 32 మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుటచూచితిని;ఆఆత్మఆయనమీదనిలిచెను. 33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోబాప్తిస్మమిచ్చువాడనినాతోచెప్పెను. 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
దేవుడు యోహానును అతనికి 30 యేండ్లు ఉన్నప్పుడు క్రీస్తు మార్గమును సిద్ధముచేయుమని, మరియు ప్రజలకు ఆయన గురించి తెలియపరచుమని పిలిచియున్నాడు. ఇది బాప్తీస్మమిచ్చు సందర్భములో జరిగినట్లుగా మనము చూడగలము. దేవుడు యోహానుకు ఎపుడు చూడనటువంటిది చూస్తావు అని చూపించియున్నాడు. కనుకనే పర్సిహుద్దాత్మ యొక్క సాక్ష్యము మనము చూడగలము. పాతనిబంధన కాలములో దేవుని సన్నిధి అప్పుడప్పుడు మాత్రమే ఉన్నది అయితే క్రీస్తు కాలములో ఆయన ఆత్మా మన హృదయాలలో ఎల్లప్పుడూ ఉంటున్నది అని మనము యెరుగుదుము. తన నిరంతరమైన ఆత్మా చేత విశ్వాసులను బలపరచినాడు.
ఇద్దరు మనుష్యులు ప్రక్క ప్రక్కన నిలిచి యొర్దాను దగ్గర పర్యవేక్షిస్తున్నప్పుడు; పరలోకము తెరవబడుట నిశ్శబ్దముగా చూసారు, అయితే యోహాను పరిశుద్దాత్మ తెల్ల రంగు అనగా నీలి రంగైనా ఆకాశమునకు విరుద్ధమైన రంగులో కనబడినది, దానికి అర్థము సమాధానము మరియు సాత్వికము.
పరిశుద్దాత్మ పావురము అక్కడున్న యోహాను మీద కానీ లేదా ప్రజలమీద కానీ వాలలేదు అయితే క్రీస్తు పైన మాత్రమే వాలి, ఈయన ప్రవక్తలకంటే మరియు అన్ని ప్రాణులకంటే గొప్పవాడని సాదృశ్యమాయెను. యోహానుకు తనతో దేవుడు ఉంది ఈ నిత్యమైన కార్యములు చేయుచున్నాడని నమ్మియున్నాడు.
యోహాను తన తల్లి గర్భములో ఉన్నప్పుడే మరియమ్మ గర్భము ధరించి వచ్చినప్పుడు సంతోషముతో ఆనందముతో గంతులు వేసెనని మనము చదవాలగాలము (లూకా 1:36-45)
యోహాను క్రీస్తు పరిశుద్ధాత్మను ఇచ్చువాడు అని అరథముచేసికొనెను, అయితే ఈ దర్శనమును తెలుసుకోలేదు, అయితే బహిరంగముగా " ప్రభువు వచ్చియున్నాడు; అయితే తీర్పు చెప్పుటకు కాదు కానీ తన ప్రేమను, మంచిని పంచుటకు. ఆయన ఒక సామాన్యమైన మనిషి కాదు అయితే దేవుని కుమారుడైన పరిశుద్దాత్మునిచేత నింపబడినవాడు.కనుక ఎవరైతే అతనిని నమ్ముతారో వారు ఈయన దేవుని కుమారుడని నమ్మి ఒప్పుకుంటారు. " యోహాను క్రీస్తు రాకడ యొక్క గురిని చెప్పి: దేవుడు ఆత్మా అయి ఉన్నాడు, తన కుమారుడు కూడా ఆత్మా ద్వారా శరీరమును ధరించియున్నాడు. కనుక దేవుడు ప్రేమ అయి ఉన్నాడు.
ప్రియమైన సహోదరుడా నీవు పరిశుద్దాత్మునిచేత నింపబడ్డావా? క్రీస్తు శక్తిని నీవు నీ జీవితములో అనుభవించి ఉన్నావా? అయితే ఇది కేవలము నీకొరకు త్యాగము చేసిన క్రీస్తును క్షమించుమని అడిగినట్లయితేనే నీకు కలుగును. ఎవరైతే దేవుని గొర్రెపిల్ల యొక్క క్షమాపణను అంగీకరిస్తారా వారు మాత్రమే పరిశుద్దాత్మ చేత నింపబడతారు. కనుక దేవుని కుమారుడైన క్రీస్తు ప్రతి విశ్వాసికి పరిశుద్దాత్మ బహుమానాలు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు.
ప్రార్థన: పరిశుద్ధమైన దేవుని కుమారుడా మేము నిన్ను ఆరాధించి ఘనపరచెదము. మా పాపముల కొరకు మా కొరకు మీరు ఎంతగానో తగ్గించుకొని యున్నారు. మా పాపములను బట్టి మమ్ములను క్షమించినందుకు మరియు మా పాపముల కొరకు సిలువలో కార్చిన నీ రక్తము కొరకై నీకు కృతఙ్ఞతలు. మా మీద మరియు మిమ్ములను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిమీద నీ పరిశుద్ధాత్మను నింపినందుకు నీకు కృతఙ్ఞతలు. ఇంకనూ పాపమని నిద్రలో ఉన్న అనేకులను లేపి, నీ సత్యముచేత నింపుము.
ప్రశ్న:
- పరిశుద్దాత్ముడ్ని ఇచ్చు క్రీస్తుగా ఎందుకు యేసు అయ్యాడు ?